logo

అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషిచేయాలి:-ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

సమానత్వ దిక్సూచి అంబేద్కర్: షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్. vbstv న్యూస్ షాద్ నగర్ / ఏప్రిల్ 08: ఈరోజు ఆలిండియా అంబేద్కర్ యువజన సంఘం రంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జీవిత చరిత్ర కరపత్రాన్ని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారతదేశంలోని అసమానతలపై విరోచిత పోరాటం చేసిన మహనీయుడు అంబేద్కర్ అన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరునిపై ఉందని ఆయన అన్నారు. అంబేద్కర్ గారి త్యాగాల పోరాట ఫలితంగా భారత రాజ్యాంగం ద్వారా భారతదేశ ప్రజలకు హక్కులు, రిజర్వేషన్లు కల్పించబడ్డాయి అని అన్నారు. అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని, సమ సమాజమే లక్ష్యంగా ముందుకు కొనసాగాలనిపిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలిండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శి మహేష్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బేగరి ప్రభాకర్, జిల్లా ఉపాధ్యక్షులు మైలారం సుబ్రహ్మణ్యం,చేవెళ్ల మండల అధ్యక్షులు మల్లెపల్లి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు కావలి గణేష్, షాద్నగర్ డివిజన్ అధ్యక్షులు జగన్ ఫరూక్నగర్ మండల్ అధ్యక్షులు గుర్రంపల్లి ఆంజనేయులు కాంగ్రెస్ పార్టీ కొత్తూరు మండల అధ్యక్షులు హరినాద్ రెడ్డి నెహ్రూ హేమంత్ శీను శ్రీనివాస్ గోవింద్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

2
1704 views